పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక నయాబజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణ చేయాలన్నారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాల రవాణా పోలీస్ ఎస్కార్ట్ తో చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించవద్దని, విద్యార్ధులతోపాటు, సిబ్బందిని ప్రిస్కింగ్ చేపట్టి, తనిఖీ తర్వాతనే అనుమతించాలని ఆయన తెలిపారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వుంటూ, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సజావు పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగాఏర్పాటు చేసిన 97 పరీక్షా కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10148, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 6429, మొత్తం 16577 మంది రెగ్యులర్, 279 మంది ప్రయివేటుగా పరీక్షలు వ్రాస్తున్నట్లు ఆయన అన్నారు. 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 97 మంది శాఖాధికారులు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్, 97 సిట్టింగ్ స్క్వాడ్, 1983 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఈ సందర్భంగా నయాబజార్ కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ నర్సింహారావు, అధికారులు తదితరులు ఉన్నారు.…..

Related Posts

You cannot copy content of this page