భౌరంపేట్ లో కంటి వెలుగు శిబిరాన్ని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్లు….

Spread the love

భౌరంపేట్ లో కంటి వెలుగు శిబిరాన్ని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్లు….


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ లోని 16వ వార్డ్ కుమ్మరి సంగం నందు మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ మరియు స్థానిక BRS పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వృద్దులకు కళ్ళ అద్దాలను అందచేసారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో ఉచితంగా కళ్ళ వైద్య పరీక్షలు జరిపించి కళ్ళ అద్దాలను అందించి, మెరుగైన సేవలను అందిస్తున్నారన్నారు . ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బాల్ రెడ్డి , BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , సురేందర్ రెడ్డి , బుచ్చిరెడ్డి , దర్శన్ రెడ్డి ,పోలీస్ గోవింద్ రెడ్డి , PACS డైరెక్టర్లు సత్తిరెడ్డి , భీమ్ రెడ్డి , మరియు మన్నె శేఖర్, ఆకుల యాదయ్య, కుమ్మరి శ్రీశైలం, జీవన్ రెడ్డి, కొమ్ము కృష్ణ, నవీన్, మహేష్ మరియు మున్సిపల్ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page