SAKSHITHA NEWS

మంత్రి ఆదిములపు సురేష్ కి కీలక బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి.”

శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి గారి అధీనంలో ఉన్న శాఖలకు సంబంధించి, బిల్లులు ప్రవేశపెట్టేందుకు, చర్చించేందుకు, శాసనసభ్యులకు సమాధానాలు చెప్పేందుకు, మొదలగు కార్యకలాపాల కోసం ఇతర మంత్రులకు కేటాయించడం ఆనవాయితీ.

అందులో భాగంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దనున్న అతి కీలకమైన “చట్టం మరియు న్యాయ శాఖ” సంబందించిన బాధ్యతలను శాసనసభ సమావేశాల్లో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి అప్పచెబుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.


SAKSHITHA NEWS