ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యం

Spread the love

బాపట్ల జిల్లా

బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం లో భాగంగా నేడు కర్లపాలెం మండలం లోని పేరలి గ్రామంలో బక్కావారిపాలెం లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ మహిళలకు ప్రాధాన్యత ను ఇస్తూ వారికి చీర,నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురుంచి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ గారి కామెంట్స్..

👉 బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను మీ ఆశీస్సులు కోరుతూ మీ ముందుకు వచ్చాను.

👉 నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి అవకాశం ఇవ్వండి..అవినీతికి తావులేని పారదర్శక పాలన అందిస్తాను.మనందరం కలిసికట్టుగా బాపట్ల ను అభివృద్ధి చేసుకొందాం.

👉 పెరలి గ్రామం అంటే తెలుగుదేశం అడ్డాగా చేసుకునేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి.

👉 మొదటి నుండి దళితులకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ.వైసీపీ ప్రభుత్వం లో దళితులకు చాలా అన్యాయం జరిగింది. వారికి రావాల్సిన చాలా సంక్షేమ పథకాలు నిలిపివేశారు.

👉 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెరలి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలుస్తున్నామని నరేంద్ర వర్మ గారు భరోసా ఇచ్చారు.

👉 ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల, పేరలి గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page