సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం

Spread the love

Thalasani Srinivas Yadav is saddened by the death of film actor Nandamuri Tarakaratna.

సాక్షిత : సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఫిల్మ్ చాంబర్ లో తారకరత్న పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన 20 వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న 21 కి పైగా చిత్రాలలో నటించారని తెలిపారు.

అందరితో ఎంతో కలివిడిగా ఉండే తారకరత్న మరణవార్త తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. తాత నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడిచేవారని చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.

ఫిల్మ్ చాంబర్ లో తారకరత్న పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన 20 వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న 21 కి పైగా చిత్రాలలో నటించారని తెలిపారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే తారకరత్న మరణవార్త తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. తాత నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడిచేవారని చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page