ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్

Spread the love

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచాడని అన్నారు. సంబంధిత గ్రూపు లెక్చరర్ తిరుపతి రెడ్డిని కూడా ప్రిన్సిపాల్ అభినందించారు.రామక్కపేట గ్రామ వాసి..స్టూడెంట్ తండ్రి కూడా ఇదే కాలేజ్ లో ఇదే గ్రూపు చదివి జే ఎల్ ఎం గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

Related Posts

You cannot copy content of this page