ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు – ఎమ్మార్వో శ్రీనివాస్

Spread the love

— ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తాం.

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు
శివనేని గూడెంలో పుడమి వెంచర్ 328 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 360లో ఉన్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్ సదరు పుడమి వెంచర్ వారికి నోటీసులు జారీ చేసి, భూమిని సర్వే చేసి 1.04 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సదరు భూమిని పట్టణ ప్రకృతి వనానికి కేటాయించి సంబంధిత పత్రాలను మున్సిపాలిటీ కమీషనర్ మందడి రామ దుర్గారెడ్డి కి అందజేయడం జరిగిందని తహసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు, నాయకులు పుడమి వెంచర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page