మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర బిజెపి కార్యవర్గసభ్యుడు జెఎస్ఆర్

Spread the love

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పట్టణంలో 6 వ వార్డులోని బిజెపి నాయకులు వడ్డేపల్లి లక్ష్మయ్య తల్లి గౌరవ్వ అనారోగ్యంతో బాధపడుతు మరణించగా 11 వ వార్డులో ముగ్గురు వ్యక్తులు బత్తిని మల్లేశం శీలం నారాయణ బూర్ల సత్యనారాయణ ఇటీవల వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి మనోధైర్యం కల్పించారు.


ఈ పరామర్శ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్, బిజెపి హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షులు గొల్లపల్లి వీరాచారి, పట్టణ ఉపాధ్యక్షులు బోగా మహేష్కర్, గాదాసు రాంప్రసాద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, బిజెవైయం పట్టణ అధికార ప్రతినిధి అశాడపు శ్రీనివాస్, కార్యదర్శి అబ్బిడి లింగారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page