నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌.. అనుమతినిచ్చిన ఎస్పీ

Spread the love

నల్లగొండ:-ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతినిచ్చారు. కాగా, కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


అందులో భాగాంగా సభకు అనుమతి కోరుతూ బుధవారం జిల్లా ఎస్పీ చందన దీప్తిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీంద్ర సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్, మందడి సైదిరెడ్డి రెడ్డి, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, మెరుగు గోపి, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, తదితరులు ఎస్పీని కలిశారు

Related Posts

You cannot copy content of this page