హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేసిన యస్.పి అపూర్వరావు

Spread the love

— పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు

–పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా.

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా ఉంటుందని యస్.పి అపూర్వ రావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డ్ గా పనిచేస్తూ డిసెంబర్ 2022 న డ్యూటీ నిమిత్తం మేకల అభినవ్ స్టేడియం నందు అభ్యర్ధులకు పోలీస్ సెలక్షన్స్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మృతి చెందిన హో గార్డ్ జె.వెంకటయ్య సతీమణి రాజేశ్వరికి (సోషల్ సెక్యూరిటీ స్కీమ్) ప్రభుత్వం ద్వారా మంజూరైన ప్రమాద బీమా 5లక్షల రూపాయల చెక్కును
వారి కుటుంబ సభ్యులకు
జిల్లా యస్.పి అందజేసి పరామర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐ.పి.యస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, హోం గార్డ్ ఆర్. ఐ కృష్ణా రావు, వెల్ఫేర్ ఆర్. ఐ స్పర్జన్ రాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page