సాక్షిత నెల్లూరు జిల్లా : కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు పట్టణ నూతన ఎస్ఐగా ఎస్ కే మహమ్మద్ హనీఫ్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వన్ టౌన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై హనీఫ్ బదిలీపై కందుకూరు విచ్చేశారు.గతంలోగూడూరు రూరల్,నెల్లూరు క్రైమ్,పెళ్ళకూరు,చేజర్ల పోలీస్ స్టేషన్లో చేశారు. ఈ సందర్భంగా ఎస్సై హనీఫ్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రాముఖ్యతనిస్తానని అన్నారు. పేకాట, జూదం, కోడిపందాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-3.42.14-PM-646x1024.jpeg)