బాపట్ల మండలం వెదుళ్ళపల్లి లోని రామయ్య వికలాంగుల కాలనీ లో మా నమ్మకం నువ్వే జగనన్న

Spread the love

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి లోని రామయ్య వికలాంగుల కాలనీ లో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదేశాలమేరకు బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య కాలనీ లోని దివ్యాంగుల నాయకులతో కలిసి ఇంటి గోడలపై మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను అంటించారు.

ఈ సందర్భంగా చల్లా రామయ్య విలేఖరులతో మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్తు అంటూ వికలాంగులకు అందరికీ జగనన్న ఇచ్చే పింఛన్లు,జగనన్న ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలు అందుతున్నందుకు ఆనందంగా వున్నారని తెలిపారు.నిన్న బాపట్ల జనసేన పార్టీ నాయకులు జగనన్న ప్రభుత్వం వికలాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని విమర్శలు చేయటాన్ని చల్లా రామయ్య తీవ్రంగా ఖండించారు. బీజేపీ చంద్రబాబు ల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు సిఎం జగనన్న ను విమర్శలు చేసే స్థాయి లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేసే స్థాయి తనకు లేదని జనసైనికుడు మాట్లాడిన మాటలకు సవాల్ చేస్తూ మీ అధినేత పవన్ కళ్యాణ్ బాపట్ల లోనే పుట్టాను అని అంటున్నాడు కదా అలాగైతే సిఎం జగనన్న మరియు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో బాపట్ల లో ఏ వార్డు లోనైనా గానీ పవన్ కళ్యాణ్ కౌన్సిలర్ గా నా పోటీచేస్తే అప్పుడు ఎవరి స్థాయి ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని చల్లా రామయ్య ఘాటుగా సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు,భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి,మారిన ఎలీషా,గుర్రం భూలక్ష్మి తదితర కాలనీ మహిళలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page