బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన శేపూరి రవీందర్

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా
రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా
శేపూరి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి ,మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ కి ,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి,కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, పివి శ్యామ్ సుందర్ రావు కి ధన్యవాదాలు తెలుపుతున్నానని నకిరేకల్ నియోజకవర్గం లో బీజేపీ జెండా ఎగిరే వరకు కృషి చేస్తూ ప్రతి బీజేపీ కార్యకర్తను కాపడుతానని , అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. శేపూరి రవీందర్ ని రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక చేయడం పట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు వర్షం వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గం లో బిజెపి పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని అధినాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page