శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు

Spread the love

ముఖ్యఅతిథిగా సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు ఆర్జె రత్నాకర్ పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెక్కపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమును
ప్రారంభించి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతో జక్కపల్లి గ్రామ వాసులు అందరూ కలిసి తలా కొంత చందాలు వేసుకొని భజన మండలి నూతన భవనమును నిర్మించుకోవటం ఆనందదాయకమని భజన మండలికి హాజరైతే విభజన ఉండదని గ్రామం ప్రశాంతంగా ఉంటుందని గ్రామాలు ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుందని ప్రసంగించారు. ఖమ్మం పట్టణంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిత్య అన్నదాన కార్యక్రమం ఆరవ వార్షికోత్సవం కు హాజరై ప్రతిరోజు క్రమం తప్పకుండా 500 మందికి అన్నదానం చేస్తున్న ఖమ్మం జిల్లా సత్యసాయి సంస్థ సభ్యులను ప్రసంగిస్తూ ప్రశంసించారు. వైరా సత్యసాయి సమితి వారు నిర్వహించబోయే గోశాలను ప్రారంభించారు. సాయంత్రం సత్తుపల్లిలో సత్యసాయి సమితి మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై సత్యసాయి సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమమునకు
జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ రావు, కన్వీనర్ ఆలస్యం నరసింహారావు
మాదిరాజు రామచంద్ర రావు, మూర్తి, ఆదినారాయణ, బుల్ల రామారావు, కొదుమూరు వెంకటేశ్వర్లు,రామారావు, బర్లే రామారావు, సాయి సుధాకర్, భాస్కర రావు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page