సర్పంచ్ గా సేవ సంతృప్తినిచ్చింది

Spread the love

పదవి లేకున్నా ప్రజా సేవలో ఉంటా: గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్

గ్రామస్తుల ఆధ్వర్యంలో సన్మానం, వీడ్కోలు

శంకర్‌పల్లి; ఫిబ్రవరి 04: ( సాక్షిత న్యూస్): ఐదేండ్లపాటు సర్పంచుగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్‌పల్లి మండల గోపులారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ అన్నారు. సర్పంచుగా పదవి కాలం
ముగించుకున్న సందర్భంగా ఆదివారం మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల, ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కు సన్మా నం, వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మాజీ సర్పంచ్,
పాలకవర్గ సభ్యులకు, గ్రామపెద్దలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఐదేళ్ల పాటు గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు బాధ్యతగా కృషి చేశానని అన్నారు. సర్పంచుగా అందించిన సేవలు సంతృప్తిని ఇచ్చాయన్నారు.

రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షమేరకు ఉన్నత పదవులు పొంది ప్రజా సేవకు పాటుపడతానని అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచుగా చిన్న వయస్సులోనే మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page