ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

Spread the love

Satthupalli MLA Sandra Venkata Veeraiah who met Chief Minister KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రూ 100 కోట్లు ఏస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాదు నందు ప్రగతిభవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు మోడ్రైజేషన్, లంకసాగర్ ప్రాజెక్టు మోడరైజేషన్, ఎన్టీఆర్ కెనాల్ మరమత్తులు, సత్తుపల్లి నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్లకు తల్లాడ నుండి కొడవటిమెట్టకు, బస్వాపురం నుండి పెద్దకోరుకొండికి, చిన్నకోరుకకొండి నుండి ఆర్లపాడుకు, గణేష్ పాడు నుండి గంగదేవిపాడుకు ఆర్ అండ్ బి రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ నుండి లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.

Related Posts

You cannot copy content of this page