మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

Spread the love

మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాలలో త్వరలో నిర్వహించనున్న బోనాల పండుగ ఏర్పాట్లపై పలువురితో శంభీపూర్ లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, దేవాలయ పరిసర పరిసరాల్లో ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. జాతర కారణంగా మల్లంపేట పోచమ్మ దేవాలయ చుట్టూపక్కల ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా తాగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంను వెళ్లి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, అనంత స్వామి, నాయకులు ఎంబరి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, ఉట్ల శ్రీహరి, ఉట్ల లక్ష్మి నారాయణ, సంగొల్ల సత్తయ్య, బలవంత్ రెడ్డి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page