కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ స్వంత గూటికి చేరిన రమేష్

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరగా తిరిగి స్వంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి రాగ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ .*

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారు బూటకపు హామీలు ,అమలు కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు అని , పక్క పార్టీల వారిని పార్టీ లో చేర్చుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారు అని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మభ్య పెట్టి ప్రలోబాలకు గురి చేస్తూ పార్టీలో చేర్చుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితోలో కాంగ్రెస్ పార్టీ దిగజారింది అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.

నిఖార్సయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు పార్టీ ని వదిలి వెళ్లరు అని, బీఆర్ఎస్ పార్టీ సముద్రంలాంటిది అని ,
శేరిలింగంపల్లి నియోజకవర్గం ను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, మంచి పనులు ఎన్నో చేశాం నిండు మనసు తో ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు, పార్టీ కి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, కార్యకర్తలే పార్టీ శ్రీ రామ రక్ష అని , యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని,మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడలని గాంధీ గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని,బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు

Related Posts

You cannot copy content of this page