ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Spread the love

ఉత్తర ప్రదేశ్
ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ఈవెంట్‌లో ఐదు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్నారు. ప్రారంభిచనున్న 5 వందే భారత్ రైళ్లతో దేశంలో మొత్తం ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య 23కు చేరుతాయి. వీటిలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌లో ప్రారంభం అవుతుండగా.. ఒకటి కర్ణాటక, ఒకటి బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ప్రారంభం అవుతాయి. వీటితో పాటు ముంబై- గోవా వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, ఈ రైలు ఇప్పటికే పరుగులు పెట్టాల్సింది కానీ, ఒడిశా రైలు ప్రమాదంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది

Related Posts

You cannot copy content of this page