హైదరాబాద్ జిల్లా లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు

Spread the love

హైదరాబాద్ నగరంలో రోజు
రోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నా యి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు అడ్డంగా దొరికిపోయారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట దగ్గర అనుమా నంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా అందు లో 25 లక్షల నకిలీ కరెన్సీ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడింది.

ఇక, నిందితులు మూడిం తల నకిలీ కరెన్సీ ఇచ్చి ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్టు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు గుర్తించారు.

కాగా, షేక్ హరుణ్, సయ్య ద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులంతా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా ఎస్ఓటి పోలీసులు గుర్తిం చారు. నిందితుల నుంచి చిల్ద్రెన్ బ్యాంక్ కు సంబం ధించిన 25 లక్షల రూపాయ ల నకిలీ కరెన్సీతో పాటు నిస్సాన్ కంపెనీకి చెందిన కారు, నాలుగు మొబైల్ ఫోన్స్ కీ ప్యాడ్ మొబైల్, 8240 వేల ఒరిజినల్ కరెన్సీ రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు….

Related Posts

You cannot copy content of this page