లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

Spread the love

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు GHMC అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. కల్వర్ట్ నిర్మాణము పై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం అని ప్రభుత్వ విప్ గాంధీ .అదేవిధంగా
వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను ,శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో , మంత్రి కేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్, EE శ్రీకాంతిని,DE దుర్గ ప్రసాద్, AE సునీల్, AE సంతోశ్ రెడ్డి , టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా ,TPS రవీందర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, పొడుగు రాంబాబు , కృష్ణ యాదవ్,నటరాజు,లింగం శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, రమణయ్య, నరేందర్ బల్లా ,సందీప్ రెడ్డి, అవినాష్, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page