SAKSHITHA NEWS

People who are disillusioned with our government program

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నీరాజనం పలుకుతున్న ప్రజలు


సాక్షిత : అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను వర్తింపచేయడం కోసమే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ,వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్,37వ డివిజన్ బొమ్మగుంట, పట్నాలు వీధిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ ముద్ర నారాయణ, డివిజన్ కార్పొరేటర్లు రేవతి, గీతా, రామస్వామి వెంకటేశ్వర్లు, కల్పన, గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపి యాదవ్, వైయస్సార్సీపి నాయకులు దొడ్డ రెడ్డి సిద్ధారెడ్డి, బొమ్మగుంట రవి, దాము,రవి రాయల్, యాదవ్ కృష్ణ, బాలసుబ్రమణ్యం,నగర పాలక అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

త్రాగునీరు,డ్రైనేజీ,మురుగు కాలువల పరిశుభ్రత,ఫాగింగ్ చేయాలని, పెన్షన్,ఇంటిస్థలాలు ఇప్పించాలని స్థానికులు కోరగా,వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అదేశించి, పరిష్కరించారు.ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు


SAKSHITHA NEWS