ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

Spread the love

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్, నాగభూషణం ఆధ్వర్యంలో జరిగింది. పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి ప్రకాష్, మిరియాల సుజాత, గాయత్రి, అరుణ, సౌజన్య, శ్రీలక్ష్మీ, మౌనిక పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page