పార్లే జీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో లభిస్తుంది.

Spread the love

ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్‌ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది.

పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవరికీ తెలియదు. నిజానికి చాలా మందికి బిస్కెట్ తింటున్నప్పుడు ఒక సందేహం వచ్చే ఉంటుంది. ఆ ప్యాకెట్ మీద క్యూట్ బేబీ ఎపరో అని, అసలు ఆమె ఇప్పుడు ఇలా ఉంది అని డౌట్స్ ఉంటాయి.

ప్యాకెట్ పై ఉండే అమ్మాయి పేరు నీరు దేశ్ పాండే. తనకు నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు తన ఫొటోను తీసుకొని పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుకున్నారంట. ఇప్పటికీ అదే అమ్మాయి ఫోటోను వాడుతుండటం విశేషం.

నీరు తండ్రి తీసిన ఫొటో పార్లేజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్లు అతని అనుమతి తీసుకుని పాప ఫొటోనే వాడుతున్నారంట. ఇప్పుడు అదే నీరు దేశ్ పాండే వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ప్రజెంట్ ఆమె వయసు 63 ఏండ్లు. కొంతమంది అసలు ఆ ఫోటోలో ఉన్నది అమ్మాయే కాదు.. కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమే అని అంటుంటారు.

Related Posts

You cannot copy content of this page