ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ, నూతనంగా ఎన్నికైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,

అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘం సభ్యులు వారధిగా నిలవాలని, కాలనీలో నెలకొన్న ఎటువంటి సమస్యలున్నతన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, అధ్యక్షులు దాసరి నర్సింగ్ రావు, సెక్రెటరీ జి నాగరాజు, ట్రెజరర్ ఎం. శంకర్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, స్వప్న మరియు కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page