ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్..

Spread the love

హైదరాబాద్ మహానగరంలోనే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణనాథుడిని నీలం మధు ముదిరాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయక దర్శనానికి విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏటా దశామహావిద్య గణపతిగా దర్శనం ఇవ్వడం అద్భుతమన్నారు. దశ మహావిధ్య గణపతిగా స్వామివారి రూపాన్ని చూస్తుంటే మహిమాన్వితంగా ఉందన్నారు. ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు విచ్చేస్తున్నారని, ఈ మహాగణపతిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారన్నారు. స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page