తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చు

Spread the love

సాక్షితసికింద్రాబాద్ : తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత రమేష్, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, బీ ఆర్ ఎస్ నేతలు మోతే శోభన్ రెడ్డి, కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరద్, ఈ ఈ ఆశలత లతో పాటు అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ..
తార్నాక – లాలాపేట రోడ్డు రద్దీ గా మారి రోడ్డును దాటేందుకు విద్యార్ధులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద రూ.2.60 కోట్ల ఖర్చుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని తెలిపారు.

ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు తో వివిధ ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నామని, స్థానికులు ఈ FOB ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సదుపాయాలను కల్పించడంలో తాము ముందు ఉంటామని తెలిపారు. స్థానిక రద్దీ పరిస్థుతులను దృష్టిలో ఉంచుకొని ఆలుగడ్డ బావి, సుదర్శన్ రెడ్డి స్వీట్ స్ ప్రాంతాల్లో కూడా రెండు FOB లను కొత్తగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అదే విధంగా చిలకలగుడా క్రాస్ రోడ్స్ వద్ద కూడా స్కై వాక్ ను ఏర్పాటు చేయాల ని రాష్ట్ర మునిసిపల్ మంత్రికి ప్రతిపాదనలను అందించడం జరిగిందని తెలిపారు. చిలకలగుడా (మెట్టుగూడ road), మనికేశ్వరి నగర్ ప్రాంతాల్లో రూ.50 కోట్ల ఖర్చుతో రెండు RUB లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను అందించామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు RUB ల నిర్మాణానికి అనుమతి లభించిందని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page