బిజిగిర్ షరీఫ్ దర్గా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మహమ్మద్ ఇక్బాల్

Spread the love

Muhammad Iqbal was elected as the President of Bizigir Sharif Dargah for the second time

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బిజిగిర్ షరీఫ్ దర్గా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మహమ్మద్ ఇక్బాల్ భాయ్,,,

జమ్మికుంటరూరల్: మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహమతుల్లాహ్ అలై దర్గా అధ్యక్షుడిగా మహ్మద్ ఇక్బాల్ 27 ఓట్లతో గెలుపొందినట్లు దర్గా ముత్తవల్లి మొహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రోజున(08-01-2023) దర్గా ముతవల్లి అక్బర్ ఆలీ ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్ హౌస్ లో బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో దర్గా ముజావర్లు మొహమ్మద్ ఇక్బాల్, అన్వర్ హుస్సేన్; చాంద్ పాషాలు అధ్యక్ష పదవి కొరకు పోటీపడ్డారు. మొత్తం 48 ఓట్లు పోలు కాగా, ఇక్బాల్ కు 27; చాంద్ పాషాకు 21 ఓట్లు పోలయ్యాయి.

మెజారిటీ ఓట్లతో మొహమ్మద్ ఇక్బాల్ బిజీగిర్ షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడిగా, జామే మస్జిద్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన పదవీ కాలం 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందని దర్గా ముతవల్లి అక్బర్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ నూతన అధ్యక్షుడు ఇక్బాల్ మాట్లాడుతూ దర్గా అభివృద్ధి కొరకు పాటుపడతానని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించినందుకు దర్గా ముజావర్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page