నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

Spread the love

నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.

దివంగత వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి గారి సేవలను గుర్తు చేసుకున్న మంత్రి కాకాణి.

మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడుతూ..

👉 జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు, గ్రామాలలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని వాటిని పూర్తి చేయడమే అజెండాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

👉 రాష్ట్రంలో 98 శాతం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు.

👉 గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందక అవస్థలు పడిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ పధకాలు పొందుతున్నారు.

👉 అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

👉 చంద్రబాబు హయాంలో గ్రామాల్లో పర్యటిస్తే, ప్రజలకు సంక్షేమ పథకాలు అందక, కోకొల్లలుగా అర్జీలు ఇచ్చేవారు.

👉 చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేశాడు.

👉 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలు ప్రజలు అందుకుంటున్నారు.

👉గతంలో ఎప్పుడులేని విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి, గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

👉 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు.

👉 రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర మార్కెట్లో పలుకుతుంది.

👉 అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page