క్రిస్మస్ సందర్భంగా పాస్టర్స్ పాస్టర్ అమ్మలకి కానుకలు అందజేసిన ఎంపీ రవిచంద్ర

Spread the love


MP Ravichandra gave gifts to pastor’s pastor’s mothers during Christmas

క్రిస్మస్ సందర్భంగా పాస్టర్స్ పాస్టర్ అమ్మలకి కానుకలు అందజేసిన ఎంపీ రవిచంద్ర


సాక్షిత వరంగల్ బ్యూరో చీఫ్:

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన తల్లిదండ్రులు నారాయణ, వెంకటనర్సమ్మల జ్ఞాపకార్థం క్రిస్టియన్ మత పెద్దలకు కానుకలు అందజేశారు. నర్సంపేట రోడ్డు డీసెంట్ ఫంక్షన్ హాల్ లో గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ నేతృత్వంలో ఎంపీ రవిచంద్ర తరపున వారి అన్న కిషన్ కుమారుడు శ్రీనివాస్ ఈ కానుకలు అందజేశారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సుమారు 500 మంది క్రిస్టియన్ మత పెద్దలకు నూతన వస్త్రాలను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పాస్టర్స్ పాల్ ముస్తఫా, కాకిలేటి అబ్రహం, మడిపల్లి లేవీ,గంధం అరుణ్ జేమ్స్, బాష్పాక ఏలియా, ఎమ్మెస్ సామేల్, సందెల లాజర్, కిన్నెర రవి, ఎమ్మెస్ రాజు, అసంపల్లి అబ్రహం, జన్ను ప్రభాకర్, బీ కాలేబు, జూపాక యాకోబ్, సాల్మన్ రాజ్, మహేందర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Related Posts

You cannot copy content of this page