ఎంపీ నామ నాగేశ్వరరావు అందరికీ ఆత్మబందువు.

Spread the love

MP Nama Nageswara Rao is dear to all.

ఎంపీ నామ నాగేశ్వరరావు అందరికీ ఆత్మబందువు.

పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు ఎంపీ నామ

నిరుపేద కుటుంబాలకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ భరోసా.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది ఆటో డ్రైవర్లు, హమాలీలకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి ఖాకీ చొక్కాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల కోసం కేంద్రం పై ఎంపీ నామ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బోనకల్ మండల కేంద్రంలో 180 మంది ఆటో డ్రైవర్లకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి ఖాకీ చొక్కాలు పంపిణీ చేసిన రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ని రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు

మధిర నియోజకవర్గం, బోనకల్ మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక నందు మండల పార్టీ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి 180 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు అందరికి ఆత్మబందువు గా ఉంటున్నారని తెలిపారు

ఎంపీ గా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారని తెలిపారు మరోవైపు తమ తల్లిదండ్రులు నామ ముత్తయ్య – వరలక్ష్మి గార్ల పేరుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు తమ ట్రస్ట్ నుండి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్దిక సహకారం అందించి వారిని ఉన్నత స్థాయికి చేరేలా కృషి చేశారన్నారు

పలు గ్రామాల్లో మంచి నీటి బోర్లు ఏర్పాటు తో పాటుగా హెల్త్ క్యాంపు లు సహా పలు సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఆటో డ్రైవర్లకు, హమాలీలకు అవసరమైన ఖాకీ చొక్కాలను ప్రత్యేకంగా తయారు చేపించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వేలాది మందికి అందజేయడం జరిగిందన్నారు లోక్ సభ లో పార్టీ ఫ్లోర్ లీడర్ గా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అలానే విభజన బిల్లులో ఉన్న హామీల అమలు కోసం కేంద్రం పై పార్లమెంట్ లోపల ,బయట అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అలాంటి నాయకుడికి మనం అందరం కలిసి అండగా నిలవాలని కోరారు

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, నాయకులు తన్నీరు రవికుమార్, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు మండల పార్టీ కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ,పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page