SAKSHITHA NEWS

MLA’s visit as part of ‘Pragati Yatra’

ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు నర్సింహా బస్తీ, శ్రీను బస్తీలలో పాదయాత్ర చేస్తూ పూర్తైన రోడ్లు, కమిటీ హాల్ లను పరిశీలించారు. అనంతరం మిగిలిన భూగర్భ డ్రైనేజీ తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగారావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె రాజు, నాయకులు వెంకటస్వామి, యూసుఫ్, పందిరి యాదగిరి, చిన్న వెంకటస్వామి, తారా సింగ్, ప్రభాకర్, రాజ్ కుమార్, ఇస్మాయిల్ మరియు స్థానిక నాయకులు బస్తీ వాసులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS