ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

Spread the love

ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..


సాక్షిత : 125 – గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ లో పాస్టర్ జాకబ్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రేయర్ పవర్ చర్చ్ ప్రార్థన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని ప్రార్థన మందిరాల అభివృద్ధికై ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఉన్నారు. అనంతరం పాస్టర్లు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చేపట్టిన ప్రతి పనిలో ఆ యేసు ప్రభు దీవెనలు సంపూర్ణంగా ఉండాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిషె శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, గోవర్ధన్ రెడ్డి, సుంకరి చందు ముదిరాజ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page