20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ…

Spread the love

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ…
సాక్షిత : నంద్యాల పట్టణంలో ని 7వార్దు ఫరూక్ నగర్ లో కౌన్సిలర్ కలాం భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుండి వచ్చిన డ్రైనేజీ సమస్యల ను ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి కి ప్రజలు వివరించడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారుల ను ఆదేశించి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఇచ్చిన మాటను నేడు నూతన డ్రైనేజీలను 20 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ప్రారంభించారు వార్డు ప్రజలు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

నంద్యాల పట్టణంలో 7వార్డు ఫరూక్ నగర్ కు సంబంధించి గతంలో గడపగడప మన ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ ప్రజలు వారి యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రజలు కాలువలు లేక చాలా ఇబ్బంది గా వున్నాయని చెప్పారు మేం కూడా గడపగడప పూర్తి అయిన వెంటనే మొదలుపెట్టి చేయిస్తామని మాట చెప్పిన ప్రకారం 20 లక్షల రూపాయలతో ఫరూక్ నగర్ లో  కేవలం కాలువలకే కేటాయించడం జరిగింది ప్రజలకు ఇచ్చిన మాట ను నేడు నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు
ముఖ్యంగా ప్రతి వార్డులో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన తర్వాత 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని అందులో వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నమని ఇంతటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాభూన్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి ,ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు కౌన్సిలర్స్,కలామ్ బాషా, సమ్మద్, వైసిపి నాయకులు గన్నికరిమ్, మరియు వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page