40లక్షల.రు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

అశ్వారావుపేట

40లక్షల.రు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం) కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు పంచాయతీ భవనాలు MLA మెచ్చా నాగేశ్వరరావు గారి సిఫార్సుతో మంజూరు చేసింది.ITDA శాఖ నుంచి (1కోటి 60లక్షలతో 8),పంచాయతీ రాజ్ శాఖ నుంచి (2కోట్ల 40లకలతో 12).ఈరోజు గాండ్లగూడెం(20లక్షలు) మరియు వేదాంతపురం(20లక్షలు) రెండు భావనల నిర్మాణం కోసం శంఖుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు.ఈ సందర్భంగా రెండు గ్రామాల్లోని గ్రామస్థులతో ఎమ్మెల్యే గారు సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నరు.

చిన్నారుల మనసు మెచ్చిన MLA మెచ్చా

👉 అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్లినా చిన్నారుల ఆయనతో ఫోటో దిగేందుకు ఇష్టపడుతున్నారు.
అశ్వారావుపేట మండలం వేదాంతపురం వెళ్తూ పండువారిగూడెం వద్ద ఆగి గ్రామస్తులతో మాట్లాడుతున్న MLA మెచ్చా నాగేశ్వరరావు గారి వద్దకు చిన్నారులు వచ్చి ఫోటో దిగాలని అడిగారు. దీంతో ముచ్చటపడిన ఆయన వారితో కలిసి ఫోటో దిగారు.
కల్మషం లేని మనస్తత్వం చిన్నారులను దగ్గర చేస్తుందంటుంటారు,, బహుశా అది ఇదేనేమో…..

👉 మళ్ళాయిగూడెం(పంచాయతీ),తాటినాగులగుంపు (గ్రామం)లో షర్ట్ సర్క్యూట్ వలన ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది.ఈరోజు ఆ కుటుంబాన్ని MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు అలాగే నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా బర్రం వెంకటేశ్వరరావు గారు వారికి ఏర్పాటు చేసిన సామగ్రిని MLA మెచ్చా నాగేశ్వరరావు గారి చేతుల మీదగా అందజేసారు.

👉వేదాంతపురం గ్రామంలో శంఖుస్థాపన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్ లు,మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page