40లక్షల అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

దమ్మపేట

40లక్షల అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

MLA మెచ్చా నాగేశ్వరరావు కృషితో మంజూరైన పంచాయతీ భవనాల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు

గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలు అడుగి తెలుసుకున్నారు MLA మెచ్చా

కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి 1కొటి 60లక్షలతో 8 భవనాలు మరియు ITDA శాఖ ద్వారా 1కోటి 20లక్షలతో 6 భవనాలు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు మంజూరు చేయించారు.ఈరోజు అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), సీతారాంపురం(20లక్షలు) మరియు అల్లిపల్లి (20లక్షలు) గ్రామాల్లో 40లక్షలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనాలకు ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో మరియు నాయకులు,గ్రామస్థులతో కలిసి శంఖుస్థాపన చేశారు.అనంతరం రెండు గ్రామాల్లోని గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సీతారాంపురం గ్రామంలో గ్రామస్థులు మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉందని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు పోసి ప్రధాన సమస్యను తీర్చారని అలాగే గుండెపట్వారీవుడెం – సీతారాంపురం రోడ్డు కోరారు.(MLA గారు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అని.దాదాపుగా అన్ని వీధుల్లో సీసీ రోడ్లు పోయడం జరిగిందనీ మిగిలి ఉన్న వీధుల్లో కూడా త్వరలో పోపిస్తానాని గుండెపట్వారీవుడెం – సీతారాంపురం 1కోటి రూపాయలతో BT రోడ్డు మంజూరు చేయడం జరిగిందని టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభించనున్నారని తెలిపారు.) అల్లిపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు అయిపోయాయని ఈరోజు పంచాయతీ భవనం కూడా వచ్చిందని మీరు(MLA మెచ్చా నాగేశ్వరరావు గారు) వచ్చాకే గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది జరిగిందనీ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు, నాయకులు,మహిళ నాయకురాల్లు,వార్డ్ మెంబర్ లు,అధికారులు ,గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page