రెండు నెలల్లో నాళాల అభివృద్ధి పూర్తి కావాలి.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Spread the love

కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,రెవిన్యూ మరియు వాటర్ వర్క్స్ ,జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇందులో ప్రధానంగా మైసమ్మ చెరువు, కాముని చెరువు అభివృద్ధి పనులు పై చర్చించి వీటి గుండా వెళ్ళే నాళాలు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి కావాలని సూచించారు..

లేనియెడల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.. అలాగే అల్లాపూర్ డివిజన్లోని శబ్దార్నగర్ ,రాజీవ్ గాంధీ నగర్ నాలా అభివృద్ధి కొరకు ఈ సమావేశంలో చర్చించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తెలిపారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్న ఎడల తెలియపరచాలని అన్నారు. అలాగే రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య కూడా రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో..కార్పొరేటర్ సభియా గౌసుద్దిన్…ఎమ్మార్వో స్వామి ..డి ఈ ఆనంద్..ఇరిగేషన్ AE లక్ష్మి నారాయణ..అధికారులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page