ప్రభుత్వ మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినల్ కు కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏకు (HMT) చెందిన 20ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినలకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అందులో భాగంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయించడం ఎంతో గర్వకారణం గా ఉందని దానితోపాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్ టెర్మినల్ స్థలం కేటాయించడం శుభ పరిణామమని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించడమైనదని అన్నారు

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, డివిజన్ అద్యేక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page