SAKSHITHA NEWS

“ప్రగతి యాత్ర”లో భాగంగా 84వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ అంబేడ్కర్ నగర్, రామకృష్ణ నగర్ లలో పాదయాత్ర…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 84వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ నగర్, రామకృష్ణ నగర్ లలో స్థానిక మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంబేడ్కర్ నగర్ లో మిగిలి ఉన్న వాటర్ లైన్, సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ని కోరగా.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం శ్రీధర్ రెడ్డి, డిజీఎం రాజేష్, డిఈఈ పాపమ్మ, మాజీ కౌన్సిలర్లు కిషన్ రావు, సూర్యప్రభ, స్థానిక డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, రమేష్, నసీర్, బాలరాజ్ చారి, జగదీష్ గౌడ్, రాజేశ్వర్ రావు, వెంకటేష్ చారి, జగన్, ఉపేందర్, నరసింహాచారి, బాలాచారి, శ్రీనివాస్, అక్బర్, సలీం, మక్బుల్, కయ్యుం, సురేష్, రాజు, వెంకటేష్, మధుకర్ రెడ్డి, అజయ్, సదానందం, జయం చారి, రాజశేఖర్ రెడ్డి, కనకయ్య, గణేష్, అరుణలత, లక్ష్మి, మనోహర, శశికళ, స్వరూప, రమణ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS