ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

Spread the love

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ డివిజన్ బాపునగర్, వికర్ సెక్షన్ కాలనీలో పాదయాత్ర…
దాదాపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా బాపునగర్, వీకర్ సెక్షన్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపుగా పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని త్వరలోనే వాటిని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, రమణ రెడ్డి, శంకర్ ముదిరాజ్, పోచయ్య, సుబ్బారావు, సుధాకర్ రెడ్డి, జగదీష్ గౌడ్, కృష్ణ, పెంటయ్య, నాని, దేవేందర్, ప్రభాకర్ రెడ్డి, మచెందర్, శ్రావ్య, వాని తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page