చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలను దాహార్తిని తీర్చడం దేవునికి సేవ చేసిన దానితో సమానం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

Spread the love

రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఠాగూర్ స్కూల్ వద్ద బండారి ఉమారాణి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు చేసి దాహర్తిని తీర్చడం భగవంతునికి సేవ చేసిన దానితో సమానమన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బి విజయ శేఖర్ గౌడ్, కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టి యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు జల్దా లక్ష్మీనాద్, అబ్దుల్ ఖాదర్, సతీష్ గట్టొజి, కార్తీక్ గౌడ్, బాలు నేత,రమ్మి గౌడ్, భిక్షపతి, ఆనంద్, కిరణ్, మంజూరు, అల్లాద్దీన్, బాబి చౌదరి, డివిజన్ అద్యక్షులు పుప్పాల భాస్కర్, ఠాగూర్ హై స్కూల్ కరస్పాండెంట్ బండారి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page