SAKSHITHA NEWS

MLA KP Vivekanand who toured in ‘Pragati Yatra’ in Suraram Division

సూరారం డివిజన్ లో ‘ప్రగతి యాత్ర’లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ రాజీవ్ గాంధీనగర్, స్కందా నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.

అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో రూ.3.05 కోట్లతో చేపడుతున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పనులు, పూర్తైన రోడ్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావు, మన్నె బాలేష్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మధు మోహన్, ఫెరోజ్, రెహ్మాన్, నేతిరాజ, దొడ్ల శ్రీనివాస్, ముకుంద రావు, సాజిద్, ప్రభుదాస్, మునీర్ మరియు బస్తీల వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS