SAKSHITHA NEWS

[ప్రగతి యాత్ర‘లో భాగంగా 80వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
జీడిమెట్ల 132 డివిజన్ శ్రీ దుర్గా ఎస్టేట్ కాలనీలో పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 80వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా ఎస్టేట్ కాలనీలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా రూ.75 లక్షలతో సీసీ రోడ్ల అభివృద్ధి, మంచినీటి సౌకర్యం కల్పించినందుకు కాలనీ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరగా.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం రాజేష్, ఏఈ సురేందర్ నాయక్ మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఠల్, జనరల్ సెక్రెటరీ నంబూరి, వైస్ ప్రెసిడెంట్ పార్థసారధి రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS