ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 100 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైన నేపథ్యంలో అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ధూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు శ్రీరంగం గోపికృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page