రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

పటాన్చెరు

ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రూప శ్రీ కాలనీకి చెందిన గరాట రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి నీ గరాట రెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page