చౌటుప్పల్ లో ఇంటింటి ప్రచారం ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love
MLA GMR conducted door to door campaign in Chautuppal

చౌటుప్పల్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షితచౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13 వార్డుల్లో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మునుగోడు సమగ్ర అభివృద్ధి కోసం, మతతత్వ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ప్రజల నుండి అద్భుత స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సీఎం కెసిఆర్ అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

ప్రధాని మోడీ చేనేత రంగం పైన జి ఎస్ టి విధించి, చేనేత కార్మికుల నడ్డి విరిచేశారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పని చేస్తున్నారని అన్నారు

Related Posts

You cannot copy content of this page