డాన్ బోస్కో స్కూల్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

నందిగామ పట్టణంలోని ముక్కపాటి నగర్ సమీపంలోని డాన్ బోస్కో బాయ్స్ హై స్కూల్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సువార్తను త్రికరణశుద్ధితో నేర్చుకొని మరొకరికి బోధిస్తే.. ప్రజల హృదయాలు పరివర్తనం చెందుతాయని చెప్పారు. లోకం చెడు వైపు ఎక్కువగా పరివర్తనం చెందే పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షకుడైన యేసు వద్దకు శ్రద్ధతో నడిస్తే సమాధానం దొరుకుతుందనే విషయాన్ని బైబిల్ గ్రంధం బోధిస్తుందని తెలిపారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్.సి.యం.యాజమాన్యం కూడా ఎంతో క్రమశిక్షణ, విలువలతో డాన్ బోస్కో విద్యాసంస్థల్లో బోధన చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఆర్.సి.యం. దేవసేవకులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకు ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page