10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం మరియు టాపర్స్ ను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ హజరత్ అలీ, ప్రిన్సిపల్ సయ్యద్ ముంతాజ్ అలీ మరియు టీచర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page