రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

Spread the love

రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం జిల్లా పలాస లో నిర్మాణం అవుతున్న 200 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా జరిగింది.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ వ్యాధిపై గత ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోలేదని కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పలాసలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపన చేశారని ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెలఆగస్ట్ 2 లేదా మూడో వారంలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని తెలిపారు.పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్ నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page