తాతా నిఖిల్ కు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

Spread the love

Minister Puvvada paid tributes to grandfather Nikhil

తాతా నిఖిల్ కు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడు తాతా నిఖిల్ మృతి చెందారు. ఈ మేరకు తిరుమలయిపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వారి నివసంకు వెళ్లి వారి కుటుంబాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.

వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం నిఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఎమ్మెల్సీ తాతా మధు, సుడా ఛైర్మన్ విజయ్, కార్పొరేటర్ నాగండ్ల కొటి, తాతా వెంకట కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page